
షోస్

నగరంలోని బేగంబజార్ ఫీల్ఖానాలో బంగారం, వజ్రాలతో రూపొందించిన వినాయక విగ్రహం ఈ ఏడాది గణేశ్ ఉత్సవాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఏకంగా 3.5 కిలోల బంగారంతో పాటు రూ.3 లక్షల విలువైన వజ్రాలను ఉపయోగించి ఈ విగ్రహాన్ని రూపొందించారు. దీంతో ఈ గణేశ్ విగ్రహం భక్తులను, సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటోంది.
ఈ విగ్రహం తయారీకి 16 మంది నైపుణ్యం కలిగిన కార్మికులు ఎనిమిది నెలల పాటు శ్రమించారు. ప్రస్తుతం బేగంబజార్లోని ఫీల్ఖానాలో విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. బంగారం, వజ్రాలతో రూపొందించిన ఈ ప్రత్యేక వినాయక విగ్రహం ఈ ఏడాది నగరంలోని గణేశ్ ఉత్సవాల్లో ప్రధాన హైలెట్గా నిలవనుంది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!