
రాజకీయాలు

నరేంద్ర మోదీ ఈ నెల 10న తెలంగాణ పర్యటనకు రానున్నారు. మధ్యాహ్నం 1:10 గంటలకు బెంగళూరు ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరనున్న ప్రధాని, 2:20 గంటలకు బేగంపేట్ ఎయిర్పోర్ట్కు చేరుకోనున్నారు. అనంతరం 2:30 గంటలకు బేగంపేట్ వద్ద ఏర్పాటు చేసిన వేదికపై వివిధ ప్రభుత్వ కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు.
తర్వాత హెలికాప్టర్లో హైటెక్ సిటీకి వెళ్లనున్న మోదీ, మధ్యాహ్నం 3:45 నుంచి 4:15 గంటల మధ్య సాయి సింధు హాస్పిటల్ను ప్రారంభించనున్నారు. అనంతరం 4:40 గంటలకు తిరిగి బేగంపేట్ ఎయిర్పోర్ట్కు చేరుకుని, సాయంత్రం 5:30 గంటలకు పరేడ్ గ్రౌండ్స్లో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొననున్నారు. సాయంత్రం 6:45 గంటలకు హైదరాబాద్ నుంచి జామ్నగర్కు బయలుదేరనున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!