
జనరల్

ప్రధాని నరేంద్ర మోదీ సిక్కిం రాజధాని గ్యాంగ్టక్లో విద్యార్థులతో కలిసి ఫుట్బాల్ ఆడారు. సిక్కిం రాష్ట్ర అవతరణకు 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా జరుగుతున్న ముగింపు వేడుకల కోసం ఆయన గ్యాంగ్టక్కు చేరుకున్నారు.
అధికారిక కార్యక్రమాలకు ముందు ప్రధాని యువతతో కలిసి క్రీడల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తీసిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పంచుకోవడంతో వేగంగా వైరల్ అయ్యాయి. గ్యాంగ్టక్లో యువ స్నేహితులతో కలిసి ఫుట్బాల్ ఆడటం ఎంతో ఉత్సాహాన్నిచ్చిందని ఆయన తెలిపారు.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!