

ఎన్డీయే ప్రభుత్వం 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బుధవారం దిల్లీలో జరిగిన సమావేశంలో దేశ అభివృద్ధి, రాజకీయ స్థిరత్వం, భవిష్యత్ లక్ష్యాలపై విస్తృతంగా మాట్లాడారు. దేశ ప్రజలు రాజకీయ సుస్థిరతకు ప్రాధాన్యం ఇచ్చినందువల్లే అభివృద్ధి వేగవంతమైందని ఆయన పేర్కొన్నారు. గతంలో తక్కువ వృద్ధి రేటును ‘హిందూ గ్రోత్ రేట్’గా అభివర్ణించడం ద్వారా హిందూ సమాజాన్ని అన్యాయంగా లక్ష్యంగా చేసుకున్నారని విమర్శించారు. ఎన్డీయే ప్రభుత్వం దేశాన్ని మందగమన పాలన నుంచి బయటకు తీసుకువచ్చి అభివృద్ధి మార్గంలో నడిపించిందని అన్నారు.
గత 12 ఏళ్లలో పేదరిక నిర్మూలన, మౌలిక వసతుల అభివృద్ధి, మధ్యతరగతి సంక్షేమం, ఆర్థిక వృద్ధి వంటి రంగాల్లో దేశం గణనీయమైన పురోగతి సాధించిందని మోదీ తెలిపారు. రాష్ట్రాల మధ్య ఆరోగ్యకరమైన పోటీ పెరగాలని, ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థలు, ఇన్నోవేషన్ కేంద్రాలు, ఉద్యోగాల సృష్టిలో ముందంజలో ఉండేందుకు పోటీపడాలని సూచించారు. గ్రీన్ ఎనర్జీ, అణుశక్తి, తయారీ రంగం, క్రీడల అభివృద్ధి వంటి భవిష్యత్ లక్ష్యాలను కూడా ఆయన ప్రస్తావించారు. దేశ ప్రజల విశ్వాసం, మద్దతుకు కృతజ్ఞతలు తెలుపుతూ వికసిత్ భారత్ నిర్మాణంలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!