
సినిమాలు

ఉత్తర్ప్రదేశ్లో మానవత్వాన్ని ప్రశ్నించే ఘటన చోటుచేసుకుంది. కాన్పూర్ నుంచి ప్రయాగ్రాజ్కు దాదాపు రెండు వందల గొర్రెలతో వెళ్తున్న ట్రక్ కౌశంబి జిల్లాలోని జాతీయ రహదారిపై అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ట్రక్ డ్రైవర్, క్లీనర్తో పాటు మరో ఇద్దరు గాయపడగా, పెద్ద సంఖ్యలో గొర్రెలు మృతి చెందాయి.
ప్రమాదం జరిగిన వెంటనే గాయపడిన వారికి సాయం చేయాల్సిన స్థానికులు, అక్కడ చనిపోయిన గొర్రెలను ఎత్తుకెళ్లడం ప్రారంభించారు. బాధితులు సహాయం కోసం వేడుకున్నా ఎవరూ పట్టించుకోలేదని సమాచారం. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. వైరల్గా మారిన వీడియోల ఆధారంగా గొర్రెలను తీసుకెళ్లిన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!