
సినిమాలు

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తెలంగాణలోని హనుమకొండకు చెందిన 17 ఏళ్ల నిరంజన్ను పరామర్శించారు. అరుదైన జన్యుపరమైన వ్యాధితో బాధపడుతూ మంచానికే పరిమితమైన నిరంజన్ తన కోరికగా పవన్ కళ్యాణ్ను కలవాలని కోరగా, ఆయన స్వయంగా ఇంటికి వెళ్లి కలిశారు. నిరంజన్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, తల్లిదండ్రులకు ధైర్యం చెప్పారు.
వైద్య ఖర్చుల కోసం రూ.1 లక్ష ఆర్థిక సాయం అందజేశారు. తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి తీర్థప్రసాదాలు ఇచ్చి ఆశీర్వదించారు. నిరంజన్ ఆరోగ్యం కోసం వరంగల్ భద్రకాళి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తానని తెలిపారు. కుటుంబ జీవనోపాధి మెరుగుపడేందుకు క్యాంటీన్ ఏర్పాటు చేయాలని పార్టీ నాయకులకు సూచించారు. పవన్ కళ్యాణ్ చేసిన ఈ మానవతా కార్యక్రమం అందరి ప్రశంసలు అందుకుంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!