
క్రీడలు

తిరుపతి జిల్లా పాకాల మండలం పల్లగుట్టపల్లి గ్రామానికి చెందిన రైతు బి. తిమ్మారెడ్డి (65) ఏనుగుల దాడిలో మరణించిన ఘటనపై ఉప ముఖ్యమంత్రి, అటవీ మరియు పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను అటవీ శాఖ అధికారులను అడిగి తెలుసుకున్న ఆయన, మృతుడి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఏనుగుల సంచారం, వాటి కదలికలను నిరంతరం పర్యవేక్షిస్తూ సమీప గ్రామాలకు ముందస్తు సమాచారం అందిస్తున్నప్పటికీ ఇలాంటి ఘటనలు జరగడం బాధాకరమని పవన్ కళ్యాణ్ అన్నారు. బాధిత కుటుంబాన్ని వెంటనే పరామర్శించి, ప్రభుత్వ నిబంధనల ప్రకారం తక్షణ పరిహారం అందించాలని అటవీ శాఖ అధికారులు, జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!