
రాజకీయాలు

భారత వాతావరణ శాఖ (IMD) తెలంగాణలోని పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రానున్న రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో హైదరాబాద్తో పాటు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది. వచ్చే ఏడు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొనసాగే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది.
వాతావరణ అంచనాల ప్రకారం రేపటి నుంచి జూలై 2 వరకు కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా హైదరాబాద్లో వచ్చే 48 గంటల్లో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశమున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. అవసరం లేని ప్రయాణాలను నివారించాలని, అధికారిక వాతావరణ హెచ్చరికలను అనుసరించాలని సూచించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!