
సినిమాలు

రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరతపై వస్తున్న పుకార్లను రాష్ట్ర నీటిపారుదల మరియు పౌర సరఫరాల శాఖామంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఖండించారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, కావాల్సినంత ఇంధనం అందుబాటులో ఉందని తెలిపారు. ఇంధన సరఫరాపై పర్యవేక్షణ కోసం ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు, ఫిర్యాదుల కోసం 1967 టోల్ ఫ్రీ నెంబర్ అందుబాటులో ఉంచినట్లు వెల్లడించారు.
డీజిల్ సరఫరా 210% వరకు, పెట్రోల్ సరఫరా 132% వరకు పెంచినట్లు మంత్రి తెలిపారు. రోజుకు సుమారు 36,404 కిలోలీటర్ల ఇంధనం సరఫరా అవుతుండగా, ఇది సాధారణ స్థాయికంటే 175% ఎక్కువగా ఉందన్నారు. అంతర్ రాష్ట్ర సరిహద్దుల్లో నిఘా పెంచినట్లు, వ్యవసాయ అవసరాలకు డీజిల్ సరఫరాకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెప్పారు. జిల్లాల స్థాయిలో కలెక్టర్ల ఆధ్వర్యంలో మానిటరింగ్ కమిటీలు పరిస్థితిని సమీక్షిస్తున్నాయి.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!