
సినిమాలు

బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ కరీంనగర్ మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావులను అభినందించారు. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ కరీంనగర్ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోవడం పట్ల సంతోషం వ్యక్తం చేసిన ఆయన, ఇద్దరినీ శాలువాలతో సత్కరించారు.
తెలంగాణలో బీజేపీ సాధించిన ఏకైక మేయర్ పీఠం కరీంనగర్దేనని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ నితిన్ నబిన్కు తెలిపారు. ప్రజల్లో ఉంటూ నిరంతరం పనిచేస్తే విజయాలు, పదవులు సహజంగానే వస్తాయని నితిన్ నబిన్ పేర్కొన్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ మేయర్, డిప్యూటీ మేయర్లను సునీల్ బన్సల్, రాజ్యసభ సభ్యురాలు రేఖా శర్మకు పరిచయం చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!