
జనరల్

భారతదేశం నుంచి దిగుమతి అవుతున్న మామిడి పండ్లపై నేపాల్ నిషేధం విధించింది. మామిడి పండ్లలో అధిక స్థాయిలో రసాయన పురుగుమందుల అవశేషాలు ఉన్నాయనే ఆరోపణల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. దీంతో భారత మామిడి ఎగుమతిదారులకు మరో ఎదురుదెబ్బ తగిలినట్టైంది.
ఇటీవల జపాన్ కూడా భారత మామిడి దిగుమతులపై ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. ఇప్పుడు నేపాల్ కూడా అదే బాటలో నడవడంతో భారత మామిడి ఎగుమతులపై ప్రభావం పడే అవకాశం ఉంది. ఆహార భద్రతా ప్రమాణాలు, నాణ్యత నియంత్రణ అంశాలపై మరింత కఠిన తనిఖీలు జరిగే అవకాశముందని నిపుణులు భావిస్తున్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!