
ఓటీటీ

నీట్ యూజీ రీ-ఎగ్జామ్కు హాజరయ్యే అభ్యర్థుల కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) కీలక సూచనలు జారీ చేసింది. పరీక్షల నిర్వహణలో భద్రతా ప్రమాణాలు పాటించేందుకు విద్యార్థులు సాధారణ, లేత రంగు దుస్తులు మాత్రమే ధరించాలని స్పష్టం చేసింది. పెద్ద బటన్లు, ఎక్కువ ఎంబ్రాయిడరీ, అధిక పాకెట్లు ఉన్న దుస్తులను అనుమతించబోమని తెలిపింది.
అలాగే హాఫ్ స్లీవ్స్ దుస్తులు మాత్రమే ధరించాలని, షూస్, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లు తీసుకురావద్దని సూచించింది. పరీక్షా కేంద్రంలోకి అడ్మిట్ కార్డ్, ప్రభుత్వం జారీ చేసిన గుర్తింపు కార్డు, పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్ మాత్రమే అనుమతిస్తామని పేర్కొంది. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అభ్యర్థులు అన్ని నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని NTA సూచించింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!