

పాస్పోర్ట్ ధృవీకరణ సేవల్లో అత్యుత్తమ పనితీరు కనబరిచిన తెలంగాణ పోలీసులకు కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతిష్ఠాత్మక ‘ఇన్స్టిట్యూషనల్ పెర్ఫార్మెన్స్ అవార్డ్ ఫర్ స్టేట్ పోలీస్’ పురస్కారాన్ని ప్రదానం చేసింది. న్యూఢిల్లీలో నిర్వహించిన పాస్పోర్ట్ సేవా దివస్ కార్యక్రమంలో కేంద్ర విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్. జైశంకర్ చేతుల మీదుగా తెలంగాణ డీజీపీ సి.వి. ఆనంద్ ఈ అవార్డును అందుకున్నారు. పాస్పోర్ట్ ధృవీకరణ ప్రక్రియలో వేగం, పారదర్శకత, సాంకేతిక వినియోగంలో తెలంగాణ పోలీసులు దేశానికి ఆదర్శంగా నిలిచారని కేంద్ర ప్రభుత్వం ప్రశంసించింది.
2025-26 ఆర్థిక సంవత్సరంలో అందిన 8.67 లక్షలకుపైగా పాస్పోర్ట్ దరఖాస్తుల్లో 99 శాతం ధృవీకరణ పూర్తి చేసిన తెలంగాణ పోలీసులు, కేవలం 5 నుంచి 7 రోజుల్లోనే ప్రక్రియను ముగిస్తూ రికార్డు సృష్టించారు. డీజీపీ సి.వి. ఆనంద్ అభివృద్ధి చేసిన ‘వెరిఫాస్ట్’ వ్యవస్థ కృత్రిమ మేధస్సు, డేటా మ్యాచింగ్ సాంకేతికతలతో పనిచేస్తూ నకిలీ దరఖాస్తులు, అనుమానాస్పద వివరాలను వేగంగా గుర్తిస్తోంది. 2015 నుంచి ఇప్పటివరకు పాస్పోర్ట్ సేవల రంగంలో తెలంగాణ పోలీసులకు ఇది ఏడో జాతీయ స్థాయి అవార్డు కావడం విశేషం.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!