

తెలంగాణకు తాడిచర్ల 2 బొగ్గు బ్లాక్ను కేంద్ర ప్రభుత్వం కేటాయించినట్లు కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి తెలిపారు. ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర అభివృద్ధి, సింగరేణి సంస్థ భవిష్యత్, కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
సింగరేణి సంస్థతో పలుమార్లు చర్చలు జరిపిన అనంతరం తాడిచర్ల 2 బ్లాక్ కేటాయింపు అంశాన్ని ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు కిషన్ రెడ్డి చెప్పారు. ప్రధాని ఆదేశాల మేరకు ఈ ఫైల్పై సంతకం జరిగిందని, వేలం నిర్వహించకుండా నేరుగా తెలంగాణకు ఈ బ్లాక్ను కేటాయించినట్లు తెలిపారు.
ఈ కేటాయింపుతో తెలంగాణకు అదనంగా రూ.16,000 కోట్ల ఆదాయం వచ్చే అవకాశం ఉందని మంత్రి పేర్కొన్నారు. తాడిచర్ల 2 బ్లాక్ నుంచి ఏడాదికి 6 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయవచ్చని, ఇది 40 నుంచి 50 సంవత్సరాల పాటు రాష్ట్రానికి ప్రయోజనం చేకూరుస్తుందని చెప్పారు. ఇక్కడ లభించే జీ 8 గ్రేడ్ బొగ్గు అధిక నాణ్యత కలిగి ఉందని, నైనీలో 1,500, తాడిచర్లలో 1,200 ఉద్యోగాలు సృష్టించే అవకాశం ఉందని వెల్లడించారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!