

దేశవ్యాప్తంగా భారీ ఈ-సిగరెట్ స్మగ్లింగ్ రాకెట్ను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు ఛేదించారు. ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఏకకాలంలో నిర్వహించిన దాడుల్లో భారీ ఎత్తున నిషేధిత నికోటిన్ ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆపరేషన్లో దాదాపు రూ.120 కోట్ల మార్కెట్ విలువ కలిగిన 3 లక్షలకు పైగా ఈ-సిగరెట్లు, వేప్ పరికరాలను అధికారులు సీజ్ చేసినట్లు వెల్లడించారు.
ఈ-సిగరెట్ల అక్రమ దిగుమతిపై వచ్చిన పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన డీఆర్ఐ అధికారులు అంతర్జాతీయ స్మగ్లింగ్ ముఠా కార్యకలాపాలను వెలికితీశారు. వివిధ పోర్టులు, ఎయిర్పోర్టుల ద్వారా నిషేధిత నికోటిన్ ఉత్పత్తులను దేశంలోకి అక్రమంగా తీసుకువచ్చి బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ఈ కేసుకు సంబంధించిన మరిన్ని వివరాలను అధికారులు సేకరిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!