

‘ఇన్విజిబుల్ గవర్నమెంట్, ఎఫెక్టివ్ గవర్నెన్స్’ అనేదే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ లక్ష్యమని విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. న్యూఢిల్లీలో ది ఇండియన్ ఎక్స్ప్రెస్ నిర్వహించిన ఎక్స్ప్రెస్ అడ్డా కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలోని పలు వ్యవస్థలు దెబ్బతిన్నాయని, చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై చర్యలు తప్పవని స్పష్టం చేశారు. అయితే టీడీపీ ఎప్పుడూ ప్రతీకార రాజకీయాలను ప్రోత్సహించదని అన్నారు.
రాష్ట్రంలో సాంకేతికత ఆధారిత పాలనకు ప్రాధాన్యం ఇస్తున్నామని లోకేష్ తెలిపారు. వివిధ శాఖల డేటాను సమన్వయం చేస్తూ డేటా లేక్ను రూపొందించామని, దీంతో వేగవంతమైన, సమర్థవంతమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఏర్పడిందన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ‘ఈజ్ ఆఫ్ లివింగ్’ భావనను ముందుకు తీసుకెళ్తున్నారని చెప్పారు. ఒకే వాట్సాప్ నంబర్ ద్వారా దాదాపు వెయ్యి ప్రభుత్వ సేవలను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చామని, సర్టిఫికెట్ల నుంచి ఇతర సేవల వరకు అన్నీ మొబైల్ ద్వారానే పొందే విధంగా డిజిటలైజేషన్ చేపట్టామని వెల్లడించారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!