

భారతీయ ఐటీ రంగంలోని వర్క్ కల్చర్పై ఓ టెక్ ప్రొఫెషనల్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీశాయి. నిరాజ్ అనే టెక్కీ ఎక్స్ వేదికగా చేసిన పోస్టులో, ప్రపంచవ్యాప్తంగా భారతీయ టెక్కీలకు ఉన్న డిమాండ్కు కారణం వారి ప్రతిభ మాత్రమే కాదని, తక్కువ ఖర్చుతో ఎక్కువ పని చేసే ఉద్యోగులుగా ఉండటమేనని వ్యాఖ్యానించారు. అదనపు పని గంటలు, వీకెండ్ షిఫ్ట్లు, పండుగ రోజుల్లోనూ పని చేయడం, అర్ధరాత్రి క్లయింట్ కాల్స్లో పాల్గొనడం వంటి అంశాలను భారతీయ ఉద్యోగులు ప్రశ్నించకుండా అంగీకరిస్తున్నారని ఆయన అభిప్రాయపడ్డారు.
ఈ పోస్ట్ వైరల్ కావడంతో నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు ఉద్యోగుల్లో పెరుగుతున్న బర్న్అవుట్, వ్యక్తిగత జీవితంపై పడుతున్న ప్రభావాన్ని ప్రస్తావిస్తూ పోస్టుకు మద్దతు పలికారు. మరికొందరు మాత్రం భారతీయ టెక్కీల కృషి, పోటీ సామర్థ్యాన్ని సమర్థిస్తూ విమర్శలను ఖండించారు. ప్రస్తుతం ఈ చర్చ ఐటీ రంగంలో ఉద్యోగుల మానసిక ఆరోగ్యం, వర్క్-లైఫ్ బ్యాలెన్స్, ప్రొడక్టివిటీ వంటి కీలక అంశాలపై దృష్టి సారించేలా చేసింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!