
జనరల్

విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు నేపథ్యంలో భారతీయ రైల్వే లోగోలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. రైల్వే శాఖకు చెందిన అధికారిక లోగోలో ప్రతి రైల్వే జోన్కు సూచికగా ఎరుపు రంగు నక్షత్రాలు ఉంటాయి. తాజాగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ చేరడంతో లోగోలో మరో నక్షత్రాన్ని చేర్చారు.
జూన్ 1 నుంచి దక్షిణ కోస్తా రైల్వే జోన్ దేశంలోని 18వ రైల్వే జోన్గా అధికారికంగా అమల్లోకి రానుంది. ఈ నేపథ్యంలో 18 నక్షత్రాలతో కూడిన కొత్త లోగోను రైల్వే బోర్డు విడుదల చేసింది. ఈ మార్పు విశాఖ కేంద్రంగా ఏర్పడిన కొత్త జోన్కు గుర్తింపుగా భావిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!