

అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో జరిగిన కీలక రక్షణ చర్యలో డ్రోన్ బోట్ వినియోగం ప్రాధాన్యం సంతరించుకుంది. అమెరికా సైన్యానికి చెందిన పైలట్లను రక్షించేందుకు ఉపయోగించిన ‘కార్సెయిర్’ డ్రోన్ బోట్ను అభివృద్ధి చేసిన సంస్థ సరోనిక్ టెక్నాలజీస్లో భారతీయ మూలాలున్న వైభవ్ ఆల్టేకర్ సహ వ్యవస్థాపకుడు, చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్గా ఉన్నారు. దీంతో ఆయన పేరు అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది.
2022లో టెక్సాస్లో స్థాపించబడిన సరోనిక్ టెక్నాలజీస్, అటానమస్ మారిటైమ్ సిస్టమ్స్ అభివృద్ధిలో ప్రత్యేక గుర్తింపు పొందింది. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ అభ్యసించిన వైభవ్ ఆల్టేకర్ సంస్థలో అటానమస్ సిస్టమ్స్, సాఫ్ట్వేర్ ఆర్కిటెక్చర్ విభాగాలను పర్యవేక్షిస్తున్నారు. 24 అడుగుల పొడవు కలిగిన కార్సెయిర్ డ్రోన్ బోట్ 35 నాట్స్ వేగంతో ప్రయాణించగలదు. 1,000 నాటికల్ మైళ్ల వరకు రిమోట్గా పనిచేసే ఈ బోట్ ఆధునిక నౌకాదళ ఆపరేషన్లలో కీలక పాత్ర పోషిస్తోంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!