
గాసిప్స్

ఆసియాన్ రీజినల్ ఫోరం (ఏఆర్ఎఫ్) మంత్రుల సమావేశం వేదికగా పాకిస్థాన్ చేసిన ఆరోపణలను భారత్ తీవ్రంగా ఖండించింది. ఈ సమావేశంలో పాక్ ఉప ప్రధాని, విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ కశ్మీర్ అంశం, సింధు జలాల ఒప్పందం నిలిపివేతపై భారత్ను లక్ష్యంగా చేసుకుని వ్యాఖ్యలు చేశారు.
పాక్ వ్యాఖ్యలపై భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ స్పందిస్తూ.. అంతర్జాతీయ వేదికలను పాకిస్థాన్ అసత్య ప్రచారం, దుష్ప్రచారం కోసం ఉపయోగించుకుంటోందని విమర్శించారు. తప్పుడు ఆరోపణలను భారత్ సమర్థవంతంగా ఎదుర్కొంటుందని, వాస్తవాలను ప్రపంచానికి వివరిస్తామని ఆయన స్పష్టం చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!