
సినిమాలు

ఆంధ్రప్రదేశ్ చలనచిత్ర అభివృద్ధి సంస్థ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్గా నియమితులైన మానవతావాది, కళా పోషకుడు చదలవాడ శ్రీనివాసరావును తెలుగు ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ పాలక మండలి సన్మానించింది. అధ్యక్షుడు బత్తుల ప్రసాద్ రావు, ప్రధాన కార్యదర్శి సురేష్ కొండేటి ఆయనకు పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని తెలుగు చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధికి వినియోగిస్తానని చెప్పారు.
పరిశ్రమలో చిన్నా పెద్ద తేడా లేకుండా అందరికీ అందుబాటులో ఉంటానని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పాలక మండలి సభ్యులు బాలరెడ్డి, ఎం. గిరిధర్, చదలవాడ భరద్వాజ, అప్పాజీ, పర్వీన్, బాబీ, నవీన్ తదితరులు పాల్గొని ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!