
సినిమాలు

హైదరాబాద్లోని చారిత్రక కాచిగూడ రైల్వే స్టేషన్ బుధవారంతో 110 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. 1916 జూన్ 10న నిజాం ఏడో నవాబు మీర్ ఉస్మాన్ అలీఖాన్ ఈ రైల్వే స్టేషన్ను నిర్మించారు. అప్పటి నుంచి ఇది నగరంలోని ముఖ్యమైన రైల్వే కేంద్రంగా కొనసాగుతోంది.
ఇక్కడి నుంచి రోజూ 100కు పైగా రైళ్లు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్తో పాటు దేశవ్యాప్తంగా అనేక నగరాలు, పట్టణాలకు రాకపోకలు సాగిస్తుంటాయి. దాదాపు 55 వేల మంది ప్రయాణికులు ప్రతి రోజు ఈ స్టేషన్ను ఉపయోగిస్తున్నారు. దక్షిణ మధ్య రైల్వే హైదరాబాద్ డివిజన్లో కాచిగూడ స్టేషన్ కీలక పాత్ర పోషిస్తోంది.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!