
క్రీడలు

అమెరికా న్యూజెర్సీ రాష్ట్రంలోని హల్దీ, మౌంట్ లారెల్లో బీఆర్ఎస్ నేత హరీశ్ రావుతో “మీట్ అండ్ గ్రీట్” కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ నాయకులు, ఎన్నారైలు కర్నాటి విద్యాసాగర్ తదితరులు హాజరై హరీశ్ రావుకు ఘన స్వాగతం పలికారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ సమకాలీన రాజకీయాలు, అభివృద్ధి అంశాలపై విస్తృతంగా చర్చ జరిగింది. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో తెలంగాణ రాష్ట్రం పంజాబ్ను మించి ధాన్యం ఉత్పత్తి సాధించిందని హరీశ్ రావు గుర్తు చేశారు.
ప్రతీ రంగంలో ప్రణాళికాబద్ధమైన పాలన వల్లే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమైందని ఆయన తెలిపారు. అయితే ప్రస్తుతం విజన్ లేకపోవడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, ఎన్నారైలు కూడా పెట్టుబడులపై జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యానించారు. ప్రాంతీయ పార్టీల పాత్ర దేశ రాజకీయాల్లో కీలకమని ఆయన పేర్కొన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!