
క్రీడలు

గవర్నర్ శివప్రతాప్ శుక్లా నేడు నిజామాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా యాంటీ డ్రగ్ అవేర్నెస్ కార్యక్రమానికి ఆయన హాజరుకానున్నారు. అనంతరం పసుపు బోర్డు కార్యాలయంలో రైతులతో సమావేశమై, వారి సమస్యలు, పసుపు సాగుకు సంబంధించిన అంశాలపై చర్చించనున్నారు.
అనంతరం డిచ్పల్లి మండలం ధర్మారానికి గవర్నర్ వెళ్లనున్నారు. అక్కడ ఎంపీ అరవింద్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే చెక్కుల పంపిణీ కార్యక్రమంలో శివప్రతాప్ శుక్లా పాల్గొననున్నారు. గవర్నర్ పర్యటన నేపథ్యంలో అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!