
క్రీడలు

ఆంధ్రప్రదేశ్లో ఇన్ సర్వీస్ ఉపాధ్యాయుల కోసం నిర్వహించనున్న ప్రత్యేక ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)కు నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. అర్హత కలిగిన ఉపాధ్యాయులు సెప్టెంబర్ 24 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవచ్చు. అభ్యర్థులు నిర్ణీత గడువులోగా దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులు సూచించారు.
ప్రత్యేక టెట్ పరీక్షలు అక్టోబర్ 11 నుంచి 21 వరకు నిర్వహించనున్నారు. ఇన్ సర్వీస్ టీచర్లకు అర్హత సాధించేందుకు ఈ పరీక్షను నిర్వహిస్తున్నారు. పరీక్షకు సంబంధించిన మార్గదర్శకాలు, అర్హతలు, దరఖాస్తు విధానం తదితర వివరాలను అభ్యర్థులు అధికారిక ప్రకటనలో పరిశీలించాలి.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!