

భారత్లో ఉపయోగిస్తున్న ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు (ఈవీఎంలు) ప్రభుత్వ రంగ సంస్థల్లోనే తయారవుతున్నాయని కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేష్ కుమార్ తెలిపారు. ఉత్తరప్రదేశ్లోని లక్నో పర్యటనలో భాగంగా కొల్విన్ తాలూక్దార్స్ కాలేజీలో విద్యార్థులతో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈవీఎంలు పూర్తిగా సురక్షితమైనవని, ఇంటర్నెట్, బ్లూటూత్, వైఫై వంటి వైర్లెస్ సాంకేతికతలకు వాటిని అనుసంధానం చేయడం సాధ్యం కాదని స్పష్టం చేశారు.
దేశంలో దాదాపు 100 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని, ఇంత భారీ స్థాయిలో ఎన్నికలు నిర్వహించడం గొప్ప బాధ్యత అని సీఈసీ పేర్కొన్నారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని సూచించారు. యువత చైతన్యంతో ఎన్నికల ప్రక్రియలో పాల్గొంటే ప్రజాస్వామ్యం మరింత బలోపేతమవుతుందని అన్నారు. ఈవీఎంల వినియోగం, ఎన్నికల నిర్వహణ పారదర్శకమైన నిబంధనలు, చట్టాలకు అనుగుణంగానే జరుగుతాయని వివరించారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!