
ఓటీటీ

నకిలీ ఆస్తి పత్రాలను తాకట్టు పెట్టి కోఆపరేటివ్ సొసైటీ నుంచి రూ.3 కోట్ల రుణం పొందిన దంపతులపై సైబరాబాద్ ఆర్థిక నేరాల విభాగం పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసును జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ నుంచి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈవోడబ్ల్యూ విభాగానికి బదిలీ చేసి దర్యాప్తు వేగవంతం చేశారు.
దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. రుణానికి భద్రతగా చూపిన ఆస్తి అసలు యజమాని చాలా సంవత్సరాల క్రితమే మరణించినట్లు తెలిసింది. అయినప్పటికీ నకిలీ పత్రాలు సృష్టించి రుణం పొందినట్లు ఆరోపణలు ఉన్నాయి. రుణం తిరిగి చెల్లించకపోవడంతో బకాయిలు పెరిగి భారీ మొత్తానికి చేరుకున్నట్లు అధికారులు తెలిపారు.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!