

ఆర్థిక అవకతవకలు, అనుమానాస్పద నిధుల బదిలీల కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కోల్కతా పరిసరాల్లోని ఐదు ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తోంది. ప్రాథమిక దర్యాప్తులో టీఎంసీకి సంబంధించిన బ్యాంకు ఖాతాల ద్వారా రూ.150 కోట్లకు పైగా నిధులు ఏవియేషన్, ట్రావెల్ కంపెనీల ద్వారా అనుమానాస్పదంగా మళ్లించినట్లు ఈడీ గుర్తించినట్లు సమాచారం. ఈ కేసులో కేర్వెల్ ఏవియేషన్, దాని డైరెక్టర్లు, అలాగే ఒక ఎలక్టోరల్ ట్రస్ట్కు సంబంధించిన ప్రాంగణాల్లో తనిఖీలు కొనసాగుతున్నాయి.
రాజకీయ పార్టీ నిధుల వ్యవహారంపై ఈడీ నేరుగా దర్యాప్తు చేపట్టడం అరుదైన పరిణామంగా భావిస్తున్నారు. గతంలో ఆమ్ ఆద్మీ పార్టీ ఖాతాలు కూడా ఈడీ దర్యాప్తు పరిధిలోకి వచ్చినప్పటికీ, అది ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసు దర్యాప్తులో భాగంగా జరిగింది. ప్రస్తుతం ఈడీ నిధుల మూలం, బదిలీ విధానం, వాటి వినియోగంపై సమగ్ర విచారణ కొనసాగిస్తోంది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!