
జనరల్

ఎన్డీపీఎస్ చట్టం కింద నమోదైన భారీ డ్రగ్స్ కేసు దర్యాప్తులో భాగంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మరోసారి తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో విస్తృత సోదాలు నిర్వహిస్తోంది. ప్రాథమిక సమాచారం ప్రకారం హైదరాబాద్లో ఏడు ప్రాంతాలు, బెంగళూరులో రెండు ప్రాంతాల్లో ఈడీ బృందాలు ఏకకాలంలో తనిఖీలు నిర్వహిస్తూ కీలక ఆధారాలను సేకరిస్తున్నాయి.
ఈ సోదాలు కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్ విక్రయాలకు సంబంధించిన కేసుతో ముడిపడి ఉన్నట్లు సమాచారం. ఈ కేసులో నిందితులను ఇప్పటికే హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేయగా, ఆర్థిక లావాదేవీలు, మనీలాండరింగ్ కోణంపై ఈడీ ప్రత్యేకంగా దర్యాప్తు చేపట్టింది. సోదాల సందర్భంగా పలు ఆర్థిక పత్రాలు, లావాదేవీల వివరాలు, ఇతర కీలక ఆధారాలను అధికారులు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!