
క్రీడలు

ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు శ్రీను వైట్ల భూమి కొనుగోలు వ్యవహారంలో రూ.7.2 కోట్ల మోసానికి గురైనట్లు సమాచారం. 2019లో తన మేనకోడలు స్వేతతో కలిసి వికరాబాద్ జిల్లా కడ్మూర్ ప్రాంతంలో అధిక లాభాలు వస్తాయని నమ్మించి భూమి కొనుగోలు చేయించినట్లు తెలుస్తోంది. నిందితులు నకిలీ పత్రాలు చూపించి ఒప్పందాన్ని నిజమని నమ్మించినట్లు ఆరోపణలు ఉన్నాయి.
అయితే రిజిస్ట్రేషన్ పూర్తయ్యాక, చెల్లింపులు చేసిన తర్వాత ఆ భూమి విక్రేతలకు సంబంధించినదే కాదని బయటపడింది. దీంతో శ్రీను వైట్ల హైదరాబాద్ సీసీఎస్ వద్ద ఫిర్యాదు చేసి, ఈ మోసంలో పాల్గొన్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!