
క్రీడలు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు సంబంధించిన సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ ట్రూత్ సోషల్ భారీ నష్టాన్ని చవిచూసింది. దీని మాతృ సంస్థ ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్ తొలి త్రైమాసికంలో సుమారు 400 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.3,700 కోట్లు) నష్టం నమోదు చేసింది. అదే సమయంలో కంపెనీ ఆదాయం 1 మిలియన్ డాలర్ల కంటే తక్కువగా ఉన్నట్లు ఫైలింగ్లో వెల్లడైంది.
క్రిప్టో కరెన్సీ మార్కెట్లో భారీ పతనం ఈ నష్టానికి ప్రధాన కారణమని నివేదికలు చెబుతున్నాయి. బిట్కాయిన్ విలువ భారీగా పడిపోవడంతో కంపెనీ పనితీరు దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. అయితే స్టాక్ మార్కెట్లో ట్రంప్ మీడియా విలువ 2.47 బిలియన్ డాలర్లుగా ఉంది. భవిష్యత్తులో కొత్త ఫీచర్లు, యూజర్ల విస్తరణ, టెక్ కంపెనీలతో విలీనంపై దృష్టి పెట్టనున్నట్లు సీఈఓ కెవిన్ మెక్గర్న్ తెలిపారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!