
బిజినెస్

మాస శివరాత్రి, పవిత్రమైన ఆరుద్ర నక్షత్రం ఒకేరోజు రావడంతో తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజాము నుంచే వేలాది మంది భక్తులు శివాలయాలకు చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ పరమశివుని ఆశీస్సులు పొందుతున్నారు.
ప్రముఖ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలంలో భక్తులు ముందుగా పాతాళగంగలో పవిత్ర స్నానాలు ఆచరించి, భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామిని దర్శించుకుంటున్నారు. భారీ రద్దీ దృష్ట్యా ఆలయ అధికారులు వీఐపీ బ్రేక్ దర్శనాలను తాత్కాలికంగా రద్దు చేశారు. అలాగే వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో కూడా భక్తుల రద్దీ గణనీయంగా పెరగడంతో, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!