
జనరల్

నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం కృష్ణపట్నంలో రూ.4 కోట్లకు పైగా చీటీ మోసానికి పాల్పడిన ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. కృష్ణపట్నానికి చెందిన చల్లా ఏడుకొండలు, చల్లా చెంగమ్మ దంపతులు, రాపూరుకు చెందిన చీపినాపి రవికుమార్ గత పదేళ్లుగా చీటీ వ్యాపారం నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
చీటీలు పాడుకున్న వారితో పాటు వడ్డీకి డబ్బులు ఇచ్చిన వారిని కూడా మోసం చేసి ఈ నెల 6న పరారయ్యారని సమాచారం. బాధితుల ఫిర్యాదుల మేరకు విచారణ చేపట్టిన పోలీసులు, వంద మందికి పైగా చీటీదారులు, మరో 60 మంది వ్యక్తుల నుంచి రూ.4 కోట్లకు పైగా మోసం జరిగినట్లు గుర్తించారు. శనివారం రిలయన్స్ రోడ్డు సమీపంలో నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!