
గాసిప్స్

కేంద్ర మాజీ మంత్రి ఎస్. జైపాల్ రెడ్డి వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. జైపాల్ రెడ్డి రాజకీయ నైతికతకు ప్రతీకగా నిలిచారని కొనియాడిన సీఎం, విద్యార్థి నాయకుడిగా ప్రారంభమైన ఆయన రాజకీయ ప్రస్థానం చివరి శ్వాస వరకు విలువలు, సిద్ధాంతాలకు అంకితమై సాగిందని పేర్కొన్నారు.
జైపాల్ రెడ్డి తన అపారమైన విషయ పరిజ్ఞానం, వాగ్ధాటితో ప్రజల్లోనే కాకుండా పార్లమెంట్లో కూడా చెరగని ముద్ర వేశారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఆయన ఆశయాలను తెలంగాణ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్తో పాటు కాంగ్రెస్ నేతలు రోహిన్ రెడ్డి, తుమ్మల యుగంధర్ పాల్గొన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!