
సినిమాలు

ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తనపై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన అనర్హత తీర్పుపై స్పందించారు. ఈ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్లే ఆలోచన లేదని స్పష్టం చేశారు. హైకోర్టు తీర్పును గౌరవిస్తున్నానని, ఎన్నికలు వస్తే ప్రజాక్షేత్రంలోనే పోరాడతానని తెలిపారు. ఎన్నికల్లో పోరాడటం తనకు కొత్త కాదని, ప్రజల మధ్య పోరాటాలు చేస్తూ ఈ స్థాయికి వచ్చానని పేర్కొన్నారు.
పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో దానం నాగేందర్పై తెలంగాణ హైకోర్టు సెప్టెంబర్ 18న అనర్హత వేటు వేసింది. అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గతంలో ఇచ్చిన నిర్ణయాన్ని హైకోర్టు పక్కనపెట్టి, ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానాన్ని ఖాళీగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఉపఎన్నిక జరిగితే తాను పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని దానం నాగేందర్ తెలిపారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!