

రైళ్లలో టికెట్ తనిఖీల సమయంలో టీటీఈలు, ప్రయాణికుల మధ్య జరిగే వివాదాలు, దాడులు, లంచాల ఆరోపణలకు అడ్డుకట్ట వేసేందుకు భారతీయ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. టీటీఈలకు బాడీ కెమెరాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించిన రైల్వే శాఖ ఇప్పటికే కొన్ని డివిజన్లలో వీటిని ప్రయోగాత్మకంగా పరిశీలించింది. ట్రయల్ ఫలితాలు సానుకూలంగా ఉండటంతో దేశవ్యాప్తంగా అమలు చేసేందుకు టెండర్ల ప్రక్రియ ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. డ్యూటీలో టీటీఈలు ప్రయాణికులతో మాట్లాడే సమయంలో జరిగే పరిణామాలను ఈ కెమెరాలు రికార్డు చేయనున్నాయి.
తేలికపాటి బాడీతో రూపొందించే ఈ కెమెరాలను టీటీఈల కోటు లేదా షర్ట్కు ప్రత్యేక క్లిప్ లేదా మాగ్నెటిక్ హోల్డర్తో అమర్చనున్నారు. 1080p వీడియో, వైడ్ యాంగిల్ లెన్స్, నైట్ విజన్ వంటి సదుపాయాలతో ఇవి పనిచేస్తాయి. సుమారు 12 గంటల వరకు వీడియో రికార్డు చేయగల సామర్థ్యంతో పాటు స్టోరేజ్ సదుపాయం ఉంటుంది. రికార్డయిన ఫుటేజీని టీటీఈలు స్వయంగా తొలగించలేరు; డ్యూటీ ముగిసిన తర్వాత రైల్వే సర్వర్కు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. కొన్ని మోడళ్లలో జీపీఎస్ సదుపాయం ద్వారా టీటీఈల స్థానాన్ని పర్యవేక్షించే అవకాశం ఉంది. వచ్చే ఏడాది నాటికి ప్రధాన ఎక్స్ప్రెస్, సూపర్ఫాస్ట్ రైళ్లలో ఈ విధానాన్ని విస్తరించాలని రైల్వే శాఖ యోచిస్తోంది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!