

తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గంలోని ముక్కావారిపల్లెలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కలిసి వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్గార్ అజీవికా మిషన్ (వీబీజీ రామ్ జీ) పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు జాబ్ కార్డులు అందజేసి, పథకం సమాచార పుస్తకం, కంపెండియం ఆఫ్ ఆర్టికల్స్, మిషన్ పోర్టల్ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రులు పెమ్మసాని చంద్రశేఖర్, కమలేష్ పాశ్వాన్, రాష్ట్ర మంత్రులు సత్యకుమార్ యాదవ్, అనగాని సత్యప్రసాద్, ఎమ్మెల్యే శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ రైల్వే కోడూరు నుంచే మరో జాతీయ స్థాయి ప్రతిష్ఠాత్మక పథకం ప్రారంభం కావడం గర్వకారణమన్నారు. గతంలో నరేగా కూడా రాయలసీమ నుంచే ప్రారంభమైందని గుర్తు చేశారు. వీబీజీ రామ్ జీ పథకానికి కేంద్రం నుంచి రూ.7,700 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.4,000 కోట్లు వెచ్చిస్తూ మొత్తం రూ.11,700 కోట్లతో గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని వెల్లడించారు.
ఈ పథకం ద్వారా 125 రోజుల ఉపాధి కల్పించడంతో పాటు గ్రామాల్లో రహదారులు, డ్రైనేజీలు, కాలువలు, ఇతర మౌలిక వసతుల నిర్మాణానికి అవకాశం ఉంటుందని సీఎం తెలిపారు. జియో ట్యాగింగ్, బయోమెట్రిక్ వంటి సాంకేతికతలతో పూర్తి పారదర్శకంగా పథకాన్ని అమలు చేస్తామని చెప్పారు. గాలేరు-నగరి నుంచి కోడూరుకు నీటిని తీసుకువచ్చి, జలధార ద్వారా భూగర్భ జలాలను పెంచే చర్యలు కూడా చేపడతామని వెల్లడించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!