
ఓటీటీ

సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి, కుటుంబ సభ్యులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కలిసి తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. బాధిత కుటుంబ సభ్యుల విన్నపాన్ని శ్రద్ధగా విన్న ముఖ్యమంత్రి, ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కేసుకు సంబంధించి పూర్తి స్థాయిలో న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా సాయికృష్ణ కేసులో ఉన్నతస్థాయి దర్యాప్తుకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్లు సీఎం తెలిపారు. విధుల్లో నిర్లక్ష్యం లేదా తప్పిదాలు జరిగినట్లు తేలితే ఎవరినీ ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. ఇప్పటికే సీఐ నాగరాజును సస్పెండ్ చేసినట్లు వెల్లడించిన చంద్రబాబు, తప్పు చేసినవారు ఎంతటి స్థాయిలో ఉన్నా చట్టం ముందు శిక్ష తప్పదని పేర్కొన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!