
జనరల్

పురుగుమందుల అవశేషాలు ఉన్నాయనే కారణంతో భారత ఎండుమిర్చి సరుకును చైనా తిరస్కరించినట్లు వెలువడిన వార్తలు ఎగుమతి రంగంలో ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ చర్య వెనుక వాణిజ్యపరంగా భారత్ను దెబ్బతీయాలనే వ్యూహం ఉండొచ్చని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీంతో ఎండుమిర్చి ఎగుమతుల భవిష్యత్తుపై చర్చ మొదలైంది.
ఎగుమతులపై ప్రభావం పడుతున్న నేపథ్యంలో సీసీఎఫ్ఐ శ్వేతపత్రాన్ని విడుదల చేసింది. ఈ అంశాన్ని కేంద్ర ప్రభుత్వం అంతర్జాతీయ వాణిజ్య వేదికలపై బలంగా ప్రస్తావించి, భారత ఎగుమతిదారుల ప్రయోజనాలను కాపాడేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!