

కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గ టీడీపీ కార్యకర్తల సమావేశంలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ‘నా దేశం – నా బాధ్యత, నా తెలుగుదేశం – నా బాధ్యత’ అనే భావనతో ప్రతి కార్యకర్త పనిచేస్తే టీడీపీ ఓడిపోని పార్టీగా నిలుస్తుందని ఆయన స్పష్టం చేశారు. కార్యకర్తలే పార్టీకి నిజమైన అధినేతలని పేర్కొన్నారు.
టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కలిసి పోటీ చేయడం వల్లే గత ఎన్నికల్లో 94 శాతం సీట్లలో విజయం సాధించామని చంద్రబాబు తెలిపారు. కార్యకర్తలు ఉత్తేజంగా పనిచేస్తేనే విజయాలు సాధ్యమని, అలసత్వం వహిస్తే నష్టం జరుగుతుందని హెచ్చరించారు. 2029లో కూడా కూటమి ప్రభుత్వమే కొనసాగుతుందని ధీమా వ్యక్తం చేశారు.
అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఇంటింటికీ తీసుకెళ్లాలని సూచించారు. రైతులకు ఆర్థిక సాయం, మహిళలకు ఉచిత ప్రయాణం, ఉచిత గ్యాస్ సిలిండర్లు, పెన్షన్లు వంటి పథకాలను వివరించాలని చెప్పారు. దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని సూచిస్తూ, గుండ్రేవుల ప్రాజెక్టు కోసం చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం దాదాపు రెండు వేల మంది కార్యకర్తలతో ఫోటోలు దిగారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!