

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన తెలంగాణ మంత్రివర్గ సమావేశంలో రెండో విడత కింద 2.5 లక్షల ఇందిరమ్మ ఇళ్ల మంజూరుకు ఆమోదం లభించింది. ప్రతి శాసనసభ నియోజకవర్గానికి రెండు వేల చొప్పున ఇళ్లను కేటాయించాలని నిర్ణయించారు. జూన్ 1న ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ కాగజ్నగర్లో ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. అలాగే హైదరాబాద్ నగర పరిధిలోని 24 నియోజకవర్గాల్లో మరో లక్ష ఇళ్ల నిర్మాణానికి కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలోని పూరి గుడిసెల్లో నివసిస్తున్న 15 వేల కుటుంబాలకు ఇళ్ల మంజూరు పత్రాలు ఇవ్వాలని నిర్ణయించారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలు చేయనున్నారు. 2027 గోదావరి పుష్కరాల పనులకు వెయ్యి కోట్ల రూపాయలు కేటాయించగా, పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి 587 కోట్ల రూపాయలు మంజూరు చేశారు. అలాగే జీవ విజ్ఞాన రంగ అభివృద్ధికి 2026–30 విధానానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!