
జనరల్

యూట్యూబర్ రావణ్ అలియాస్ జోసెఫ్కు ఎలమంచిలి కోర్టులో బెయిల్ మంజూరైన కొద్దిసేపటికే ఆయనను ఏలూరు పోలీసులు మళ్లీ అరెస్ట్ చేశారు. నక్కపల్లి టోల్ప్లాజా వద్ద అదుపులోకి తీసుకున్న పోలీసులు, ఏలూరులో నమోదైన కేసు సంబంధంగానే ఈ అరెస్ట్ చేసినట్లు సమాచారం. ఇప్పటికే పలుమార్లు అరెస్ట్ అయిన రావణ్కు ప్రతి సారి బెయిల్ లభించింది.
అరెస్ట్కు ముందు విడుదల చేసిన సెల్ఫీ వీడియోలో తనపై కావాలనే కక్షసాధింపు చర్యలు జరుగుతున్నాయని రావణ్ ఆరోపించారు. తాను మూడు రోజులుగా ఆమరణ నిరాహార దీక్షలో ఉన్నానని, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పుతున్నారని పేర్కొన్నారు. తనను చంపవచ్చేమో కానీ తన ప్రశ్నలను చంపలేరని వ్యాఖ్యానించారు. అయితే ఇవి రావణ్ చేసిన ఆరోపణలు మాత్రమే. ఈ వ్యాఖ్యలపై అధికారుల నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక స్పందన రాలేదు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!