
టెక్నాలజీ

పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీకి మరో రాజకీయ ఎదురుదెబ్బ తగిలింది. టీఎంసీ రాష్ట్ర అధ్యక్షురాలు చంద్రిమా భట్టాచార్య తన పదవితో పాటు పార్టీలోని అన్ని బాధ్యతలకు రాజీనామా చేశారు. పార్టీలో నమ్మకం లేని పరిస్థితుల్లో పనిచేయడం కష్టమని ఆమె పేర్కొన్నారు.
పార్టీ ప్రధాన కార్యాలయాన్ని రెబల్స్ స్వాధీనం చేసుకోవడానికి తననే కారణమని మమత ఆరోపించారని చంద్రిమా తెలిపారు. రాజీనామా అనంతరం ఆమె రెబల్స్ నాయకుడు రితబ్రత బెనర్జీని కలిశారు. ఈ పరిణామాలపై స్పందించిన మమత, రెబల్స్ను ద్రోహులుగా అభివర్ణిస్తూ పార్టీ గుర్తు తనతోనే ఉంటుందని స్పష్టం చేశారు. ఇకపై పార్టీ రాష్ట్ర, జాతీయ వ్యవహారాలను తానే పర్యవేక్షిస్తానని వెల్లడించారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!