
సినిమాలు

లడఖ్లోని లేహ్ సమీప ప్రాంతమైన టాంగ్ట్సే వద్ద భారత సైన్యానికి చెందిన చీతా హెలికాప్టర్ కూలిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మే 20న జరిగిన ఈ ప్రమాదంలో మేజర్ జనరల్ సచిన్ మెహతాతో పాటు ముగ్గురు అధికారులు గాయపడినట్లు సమాచారం. అదృష్టవశాత్తు అందరూ ప్రాణాలతో బయటపడినట్లు సైనిక వర్గాలు వెల్లడించాయి. ఈ ఘటన బుధవారం జరిగినప్పటికీ శుక్రవారం అధికారిక సమాచారం బయటకు వచ్చింది.
సింగిల్ ఇంజిన్తో నడిచే ఈ చీతా హెలికాప్టర్ను ఒక లెఫ్టినెంట్ కల్నల్, ఒక మేజర్ నడుపుతున్నట్లు తెలిసింది. ప్రమాదం జరిగిన సమయంలో హెలికాప్టర్లో 3వ పదాతిదళ విభాగం జనరల్ ఆఫీసర్ కమాండింగ్ మేజర్ జనరల్ సచిన్ మెహతా ప్రయాణిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై భారత సైన్యం దర్యాప్తు ప్రారంభించినట్లు సమాచారం.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!