
ఓటీటీ

భారత ప్రభుత్వం పాస్పోర్ట్ నిబంధనల్లో కీలక మార్పులు చేసింది. కొత్త నిబంధనల ప్రకారం 15 ఏళ్లలోపు పిల్లలకు జారీ చేసే 36 పేజీల సాధారణ పాస్పోర్ట్ జారీ చేసిన తేదీ నుంచి ఐదేళ్ల వరకు లేదా పిల్లలకు 18 ఏళ్లు నిండే వరకు చెల్లుబాటులో ఉంటుంది. ఈ రెండింటిలో ఏది ముందుగా వస్తే అదే పాస్పోర్ట్ చెల్లుబాటు గడువుగా పరిగణిస్తారు.
ఈ మార్పులతో చిన్నారుల పాస్పోర్ట్ చెల్లుబాటు విషయంలో వయసు, గడువు రెండింటినీ పరిగణనలోకి తీసుకునే విధానం అమల్లోకి వచ్చింది. దీంతో పాస్పోర్ట్ దరఖాస్తు చేసే తల్లిదండ్రులు కొత్త నిబంధనల ప్రకారం చెల్లుబాటు గడువును పరిశీలించాల్సి ఉంటుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!