
బిజినెస్

బిహార్లోని పూర్నియాలో ఓ కుటుంబం తమ 18 ఏళ్ల కుమార్తె తమ అభిప్రాయానికి విరుద్ధంగా దళిత యువకుడిని వివాహం చేసుకోవడంతో ఆమెకు ప్రతీకాత్మకంగా అంత్యక్రియలు నిర్వహించింది. రియాగా గుర్తించిన యువతి సెప్టెంబర్ 8న 24 ఏళ్ల మినల్ కుమార్తో కలిసి వెళ్లిపోయినట్లు సమాచారం. అనంతరం వీరిద్దరూ కోర్టులో వివాహం చేసుకున్నారు. ఢిల్లీలో ఆమెను పోలీసులు గుర్తించి తీసుకురాగా, తాను స్వచ్ఛందంగానే మినల్ కుమార్ను వివాహం చేసుకున్నట్లు కోర్టుకు తెలిపింది.
కుమార్తె నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేసిన కుటుంబ సభ్యులు ఆమె ఫొటోను ఉంచిన దిష్టిబొమ్మను తయారు చేసి గ్రామంలో అంతిమయాత్ర నిర్వహించారు. అనంతరం దానికి ప్రతీకాత్మకంగా దహన సంస్కారాలు నిర్వహించారు. అంతేకాకుండా రాబోయే రోజుల్లో శ్రాద్ధం, పిండప్రదానం వంటి ఆచారాలను కూడా నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!