

తెలంగాణ రాష్ట్రంలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతూ ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. వడదెబ్బ కారణంగా ఒక్కరోజులోనే 34 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలోని 16 జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 46 డిగ్రీల సెల్సియస్ను దాటడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ మరింత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తూ, వచ్చే నాలుగు రోజులు కూడా ఇదే స్థాయిలో ఎండలు కొనసాగే అవకాశముందని తెలిపింది.
ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ప్రజలు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని, ముఖ్యంగా మధ్యాహ్న వేళల్లో బయటకు రావడం తగ్గించాలని సూచించింది. అధికార యంత్రాంగం ప్రజల ప్రాణ రక్షణ కోసం ప్రత్యేక చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!