
జనరల్

దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ.. తనకు తెలియకుండా ఎమ్మెల్యే కడియం శ్రీహరి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారని ఆరోపించారు. ఇది రూల్స్ ఆఫ్ బిజినెస్ ఉల్లంఘన అని పేర్కొంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాసి చర్యలు తీసుకోవాలని కోరారు. ఆ లేఖను మీడియాకు కూడా విడుదల చేశారు. శాఖకు సంబంధించిన విధాన నిర్ణయాలు, సమీక్షలు, అభివృద్ధి కార్యక్రమాల పర్యవేక్షణ మంత్రిపరిధిలోనే ఉంటాయని స్పష్టం చేశారు.
అయితే ఎమ్మెల్యే దేవాలయాల అభివృద్ధి, నిధుల కేటాయింపు, మాస్టర్ ప్లాన్లు, భూముల పరిరక్షణ, ఆక్రమణల తొలగింపు వంటి అంశాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారని తెలిపారు. మంత్రిని పక్కన పెట్టి సమీక్షలు చేయడం పరిపాలనా వ్యవస్థలో అనుచితమని హెచ్చరించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా విచారణ జరిపించి తగిన చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!