

దేశంలోని ప్రముఖ విమానయాన సంస్థ ఎయిరిండియాలో నైతిక విలువల ఉల్లంఘనల కారణంగా గత మూడు సంవత్సరాల్లో వెయ్యికి పైగా ఉద్యోగులను తొలగించినట్లు సంస్థ సీఈఓ క్యాంప్బెల్ విల్సన్ వెల్లడించారు. సంస్థ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. విమానాల్లో అక్రమంగా వస్తువులు తరలించడం, ఉద్యోగుల ప్రయాణ సదుపాయాల దుర్వినియోగం, అదనపు లగేజీకి రుసుములు వసూలు చేయకుండా అనుమతించడం వంటి అంశాల్లో ఉల్లంఘనలు గుర్తించినట్లు పేర్కొన్నారు.
టాటా గ్రూప్ ఆధ్వర్యంలో ఎయిరిండియాను ప్రపంచ స్థాయి సంస్థగా తీర్చిదిద్దే క్రమంలో క్రమశిక్షణకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామని సీఈఓ స్పష్టం చేశారు. ప్రస్తుతం సంస్థ ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటోందని, పశ్చిమాసియా ఉద్రిక్తతలు, ఇంధన ధరల పెరుగుదల వల్ల భారీ నష్టాలు వచ్చాయని తెలిపారు. వ్యయ నియంత్రణ చర్యలతో పాటు అంతర్గత క్రమశిక్షణను మరింత బలోపేతం చేస్తున్నట్లు వెల్లడించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!