

ఇటీవల బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. దీనికి ప్రధాన కారణం అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ మేలిమి బంగారం ధర 4,379 డాలర్ల స్థాయికి చేరడమే. అదే సమయంలో దేశీయంగా 10 గ్రాముల బంగారం ధర రూ.1.32 లక్షలకు చేరింది. బంగారం ధరలు ఇలా నిరంతరం పెరుగుతున్న కారణాలు తెలుసుకోవడం ప్రతి వినియోగదారుడికి అవసరం.
దేశంలో బంగారం ధరలు భారీగా పెరగడానికి ఒక కారణం పండుగల సీజన్ అయినప్పటికీ, అసలైన ప్రధాన కారణం వివిధ దేశాల కేంద్ర బ్యాంకులు భారీగా బంగారం కొనుగోలు చేయడమే. 2025 సెప్టెంబర్ నెలలో మాత్రమే వివిధ దేశాల కేంద్ర బ్యాంకులు ఏకంగా 39,000 కిలోలు, అంటే 39 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేశాయి. ఈ విషయాన్ని ప్రపంచ స్వర్ణ మండలి విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. ఒకే నెలలో కేంద్ర బ్యాంకుల బంగారం కొనుగోళ్లు ఇంత పెద్ద స్థాయిలో జరగడం ఈ ఏడాదిలో ఇదే తొలిసారి అని డబ్ల్యూజీసీ పేర్కొంది. అలాగే, గతేడాదిలో ఇప్పటివరకు మొత్తం 634 టన్నుల బంగారాన్ని కేంద్ర బ్యాంకులు కొనుగోలు చేసినట్లు తెలిపింది.
సెప్టెంబర్ నెలలో ఏ దేశం ఎంత బంగారం కొనుగోలు చేసిందన్న వివరాల ప్రకారం, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ బ్రెజిల్ అత్యధికంగా 15 టన్నులు కొనుగోలు చేయగా, నేషనల్ బ్యాంక్ ఆఫ్ కజగిస్థాన్ 8 టన్నులు, బ్యాంక్ ఆఫ్ గ్వాటిమాలా 6,000 కిలోలు, రష్యా కేంద్ర బ్యాంక్ 3 టన్నులు, టర్కీ (తుర్కియే) 2 టన్నుల చొప్పున బంగారాన్ని కొనుగోలు చేశాయి. ఇదిలా ఉండగా, వడ్డీ వ్యాపారం చేసే బ్యాంకులు కూడా బంగారంపై పెట్టుబడులు భవిష్యత్తులో మంచి లాభాలు ఇస్తాయని భావించడం వల్ల బంగారానికి డిమాండ్ మరింత పెరుగుతోంది. ఈ అన్ని కారణాల వల్లే బంగారం ధరలు ప్రస్తుతం ఎగబాకుతున్నాయి.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!